భారతదేశం, మే 5 -- ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. ఐటీ పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా అడ్వాన్స్ డ్ టెక్నాలజీస్ లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ప్రముఖ సంస్థ ఒరాకిల్ తో ఏపీఎస్ఎస్డీసీ కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ద్వారా యువతకు ఒరాకిల్ యూనివర్సిటీ లెర్నింగ్ సబ్ స్క్రిప్షన్ కంటెంట్ ఉచితంగా లభిస్తుంది.

మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల యువత ఒరాకిల్ క్లౌడ్ నైపుణ్యాల కోసం చేయూత అందించడమే ఈ ఒప్పందం ముఖ్యోద్దేశం అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మూడేళ్లలో మొత్తం 4 లక్షల మందికి ఒరాకిల్ మై లెర్న్ డిజిటల్ ప్లాట్ ఫామ్ ద్వారా శిక్షణ అందిస్తారన్నారు.

యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణ మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి ష్నైడర్ ఎలక్ట్రిక్ సంస్థతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని మంత్రి లోకేశ్ తెలిపారు. ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఎనర్జీ, నిర్మాణ రంగాల్ల...