భారతదేశం, జూన్ 5 -- బాలీవుడ్ లో తెలుగు కథలు, తెలుగు టెక్నీషియన్లు, డైరెక్టర్లు, హీరోల ఆధిపత్యం కొనసాగుతోంది. మన కథలు బాలీవుడ్ ను ఏలుతున్నాయి. సందీప్ రెడ్డి వంగా లాంటి మన డైరెక్టర్లు హిందీ సినిమాను షేక్ చేస్తున్నారు. ఇప్పుడు మరో తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్ లో తీసిన ఫస్ట్ మూవీ 'జాట్' ఓటీటీలోకి వచ్చేసింది.

నిజానికి బాలీవుడ్ లేటెస్ట్ ఫిల్మ్ జాట్ జూన్ 6న ఓటీటీలోకి వస్తుందన్నారు. కానీ ఒక రోజు ముందుగానే నేడు (జూన్ 5) డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది ఈ సినిమా. గురువారం ఓటీటీలో అడుగుపెట్టింది జాట్. తెలుగు డైరెక్టర్ గోపీచంద్ మలినేని బాలీవుడ్ డెబ్యూ మూవీ జాట్ ఏప్రిల్ 10న థియేటర్లలో రిలీజైంది. ఈ ఫిల్మ్ లో సన్నీ డియోల్ హీరో.

యాక్షన్ థ్రిల్లర్ గా రిలీజైన ఈ మూవీ మాస్ ఆడియన్స్ తో విజిల్స్ కొట్టించింది. కలెక్షన్ల మోత మోగించింది. సుమారు రూ.100...