భారతదేశం, ఏప్రిల్ 30 -- మ‌ల‌యాళం హార‌ర్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ మూవీ వ‌డ‌క్క‌న్ ఒకే రోజు రెండు ఓటీటీల‌లోకి వ‌చ్చింది. మంగ‌ళ‌వారం అమెజాన్ ప్రైమ్‌తో పాటు సైనా ప్లే ఓటీటీలో ఈ మూవీ రిలీజైంది. ఈ మ‌ల‌యాళం మూవీలో కాంతార కిషోర్ తో పాటు శృతి మీన‌న్‌, మెర్లిన్ ఫిలిప్‌, మీనాక్షి ఉన్ని కృష్ణ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

సాజీద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మ‌ల‌యాళం మూవీకి ఆస్కార్ విన్న‌ర్ ర‌సూల్ పొకుట్టి సౌండ్ డిజైన‌ర్‌గా ప‌నిచేశాడు. బాలీవుడ్‌ సినిమాటోగ్రాఫ‌ర్ కైకో న‌కారా కెమెరామెన్‌గా ప‌నిచేసింది. మార్చి ఫ‌స్ట్ వీక్‌లో థియేట‌ర్ల‌లో రిలీజైన వ‌డ‌క్క‌న్ మూవీ టెక్నిక‌ల్‌గా మంచి మూవీగా ప్రేక్ష‌కుల‌ను మెప్పించింది.

సౌండ్ డిజైనింగ్‌, విజువ‌ల్స్ ప‌రంగా మ‌ల‌యాళంలో వ‌చ్చిన బెస్ట్ హార‌ర్ మూవీస్‌లో ఒక‌టిగా నిలిచింది.

ఐఎమ్‌డీబీలో ఈ మూవీ 9.1 రేటింగ్‌ను సొంతం చేసుకున్న...