భారతదేశం, ఏప్రిల్ 26 -- మ‌ల‌యాళం సినిమాలు కుమ్మ‌ట్టిక‌లి, క‌ల్లం ఒకే రోజు ఓటీటీలోకి వ‌చ్చాయి. శుక్ర‌వారం రోజు ఈ రెండు సినిమాలు మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో రిలీజ‌య్యాయి. కుమ్మ‌ట్టిక‌లి, క‌ల్లం సినిమాలు థియేట‌ర్ల‌లో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి వ‌సూళ్ల‌ను రాబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం.

మ‌ల‌యాళం సీనియ‌ర్ హీరో సురేష్ గోపి త‌న‌యుడు మాధ‌వ్ సురేష్ కుమ్మ‌ట్టిక‌లి మూవీతో హీరోగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. యాక్ష‌న్ క్రైమ్ కామెడీ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ మూవీ ఆర్‌కే విన్సెట్ సెల్వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. టాలీవుడ్ సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ ఆర్‌బీ చౌద‌రి కుమ్మ‌ట్టిక‌లి మూవీని నిర్మించాడు. ఈ సినిమాలో మాధ‌వ్ సురేష్‌తో పాటు మిథున్ ప్ర‌కాష్‌, రాసిక్ అజ్మ‌ల్‌, లీనా కుమార్‌, మైమ్ గోపి కీల‌క పాత్ర‌లు పోషించారు.

తొలి సినిమాతోనే హీరోగా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ను ...