భారతదేశం, మే 9 -- మ‌ల‌యాళం సినిమాలు ఔసిప్పింతే ఒసియాతు, ప్ర‌తి నిర‌ప‌రాధియానో శుక్ర‌వారం ఓటీటీలోకి వ‌చ్చాయి. ఈ రెండు మ‌ల‌యాళం సినిమాలు మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్నాయి. ఔసిప్పింతే ఒసియాతు మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌థాంశంతో తెర‌కెక్క‌గా ప్ర‌తి నిర‌ప‌రాధియానో క్రైమ్ ఇన్వేస్టిగేష‌న్ క‌థ‌తో రూపొందింది.

ఔసిప్పింతే ఒసియాతు మార్చి ఫ‌స్ట్ వీక్‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. కుటుంబ బంధాల‌కు మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ అంశాల‌ను జోడించి తెర‌కెక్కిన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. ఔసిప్పింతే ఒసియాతు మూవీలో కిష్కింద కాండం ఫేమ్ విజ‌య రాఘ‌వ‌న్ కీల‌క పాత్ర పోషించాడు. దిలీప్ పోత‌న్‌, క‌ళాభ‌వ‌న్ షాజోన్‌, లీనా, అంజ‌లి కృష్ణ కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. శ‌ర‌త్ చంద్ర‌న్ ఆర్‌జే మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అనుబంధాలు, ఆప్యాయ‌త‌ల‌ను డ‌బ్బు ఎలా ...