భారతదేశం, మే 23 -- బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్‌ కందేరేకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఇది కూడా కళ్యాణ్ జ్యువెల్లర్స్‌కు చెందిన సంస్థ. ఇది ప్రీమియం లైఫ్‌స్టైల్ జ్యూవెలరీ బ్రాండ్, తన కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా షారూఖ్‌ ఖాన్‌ను ప్రకటించింది. అతడికి బ్రాండ్‌లో ఎలాంటి వాటా లేదన్న విషయాన్ని కంపెనీ స్పష్టంగా తెలియజేసింది. భారత జ్యూవెలరీ రంగంలో ఇది ఒక కీలక మలుపుగా కంపెనీ పేర్కొంది. భారతీయ బ్రాండ్ స్టోరీటెల్లింగ్‌లోనూ ఒక కొత్త అధ్యాయంగా నిలుస్తోందని చెప్పింది.

ఒక స్టైలిష్ టీజర్‌తో షారూక్ ఖాన్ తన బ్రాండ్ అంబాసిడర్ అని కందేరే ప్రకటించింది. బాలీవుడ్ బాద్ షా ఆభరణాలతో కనిపించిన దృశ్యాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. దీంతో అనేక మంది ఖాన్‌కు చెందిన స్వంత బ్రాండ్ అనే ఊహలు చేశారు. ఎందుకంటే ఇప్పటికే అతడు అనేక రకాల వ్యాపారల్లో ఉన్నాడు.

అయితే కంపెనీ ఈ ఊహాగానాలను...