భారతదేశం, ఏప్రిల్ 22 -- ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది. టీడీపీ అధికార ప్రతినిధి, నాగులుప్పలపాడు మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరిని ముగ్గురు దుండగులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. వీరయ్య చౌదరి ఒంగోలులోని పద్మ టవర్స్ లోని తన ఆఫీసులో ఉండగా, ముగ్గురు వ్యక్తులు ముసుగులతో వచ్చి ఆయనపై కత్తులతో దాడి చేశారు. దుండగులు బిహార్ గ్యాంగ్ గా తెలుస్తోంది. వీరయ్య చౌదరి మృతదేహాన్ని ఒంగోలు రిమ్స్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. దాడి జరిగిన ప్రదేశాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....