భారతదేశం, జూన్ 10 -- భారత క్రికెట్ కు చేసిన సేవలకు గాను లెజెండరీ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీకి గుర్తింపు లభించింది. ప్రతిష్ఠాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో ఈ టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి చోటు దక్కింది. లండన్ లోని ప్రఖ్యాత అబ్బే రోడ్ స్టూడియోలో జరిగిన ఈ కార్యక్రమంలో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న ఏడుగురు దిగ్గజ ఆటగాళ్లలో భారత మాజీ కెప్టెన్ కూడా ఉన్నాడు. ఈ ఘనత దక్కడం పట్ల ధోని తొలిసారి రియాక్టయ్యాడు.

ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న అనంతరం ధోని తొలిసారి స్పందించాడు. ''తరతరాలుగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్ల సేవలను గుర్తించే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకోవడం గౌరవంగా భావిస్తున్నా. అలాంటి ఆల్ టైమ్ గ్రేట్స్ తో పాటు నా పేరు గుర్తుండిపోవడం ఒక అద్భుతమైన అనుభూతి. ఇది నేను ఎప్పటికీ గుర్తుంచుకునే విషయం'' అని ధోని అన్నాడ...