భారతదేశం, అక్టోబర్ 9 -- విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఐదు ఐసీసీ ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 మ్యాచ్‌లకు ముందు విశాఖపట్నం ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నిబంధనలను నిర్దేశించారు. ఈ స్టేడియం అక్టోబర్ 9 నుండి ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. భారతదేశం గురువారం అక్టోబర్ 9న దక్షిణాఫ్రికాతో, ఆదివారం అక్టోబర్ 12న ఆస్ట్రేలియాతో రెండు కీలకమైన మ్యాచ్‌లను ఆడుతుంది. రెండు మ్యాచ్‌లు మధ్యాహ్నం 3:00 గంటల నుండి రాత్రి 11:30 గంటల వరకు జరగనున్నాయి.

ఇదే సమయంలో అక్టోబర్ 13 సోమవారం బంగ్లాదేశ్-దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. ఆ తర్వాత అక్టోబర్ 16 గురువారం ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్ మ్యాచ్ జరుగుతుంది. విశాఖపట్నంలో ఆదివారం జరిగే చివరి మ్యాచ్‌లో ఇంగ్లాండ్, అక్టోబర్ 26న న్యూజిలాండ్‌తో తలపడుతుంది. వేలాది మంది ప్రేక్షకులు, వాహనాలతో ట్రాఫిక్ ...