భారతదేశం, అక్టోబర్ 14 -- ఆంధ్రప్రదేశ్‌లో భారీ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్‌ను ఏర్పాటు చేయనుంది గూగుల్. రాబోయే ఐదు సంవత్సరాలలో 15 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టనున్నట్లు గూగుల్ మంగళవారం తెలిపింది. ఇది అమెరికా వెలుపల దాని అతిపెద్ద ఏఐ హబ్. ఢిల్లీలో భారత్ ఏఐ శక్తి పేరిట నిర్వహించిన కార్యక్రమంలో గూగుల్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశ్విని వైష్ణవ్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్, గూగుల్ ప్రతినిధులు పాల్గొన్నారు.

'ఇది అమెరికా వెలుపల మేం పెట్టుబడి పెట్టే అతిపెద్ద ఏఐ హబ్.' అని గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ అన్నారు.

విశాఖపట్నంలో 1-గిగావాట్ డేటా సెంటర్ క్యాంపస్‌ను నిర్మిస్తుంది గూగుల్. ఏఐ మౌలిక సదుపాయాల బేస్‌ను ఏర్పాటు...