భారతదేశం, మే 14 -- తెలుగు కామెడీ మూవీ సినిమా పిచ్చోడు ఓటీటీలోకి వ‌చ్చింది. మంగ‌ళ‌వారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. ఫ్రీగా కాకుండా 99 రూపాయ‌ల రెంట్‌తో అమెజాన్ ఈ తెలుగు మూవీని ఓటీటీ ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చింది.

సినిమా పిచ్చోడు లోహీరోగా న‌టిస్తూ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు కుమార‌స్వామి. సావిత్ర కృష్ణ హీరోయిన్‌గా న‌టించింది. హీరోహీరోయిన్ల‌తో పాటు చాలా మంది కొత్త ఆర్టిస్టులే ఈ మూవీలో న‌టించారు. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో సినిమా పిచ్చోడు మూవీ థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఐఎమ్‌డీబీలో ప‌దికిగాను ఈ మూవీ 9.5 రేటింగ్‌ను సొంతం చేసుకున్న‌ది.

ప‌ల్లెటూరు, సిటీ అనే తేడాల‌తో ప‌ని లేకుండా న‌ట‌న‌పై ఆస‌క్తి ఉన్న‌వారు ఎవ‌రైనా హీరోలు కావ‌చ్చున‌నే పాయింట్‌కు ల‌వ్‌, యాక్ష‌న్ అంశాల‌ను జోడించి కుమార‌స్వామి ఈ సినిమాను తెర‌కెక్కించారు. అంత‌ర్లీనంగా ఇండ‌స్ట్రీ...