భారతదేశం, ఫిబ్రవరి 13 -- భారత ఐటీ రంగంపై అమ్మకాల ఒత్తిడి సునామీలా విరుచుకుపడింది. వరుసగా రెండో రోజూ టెక్ షేర్లు భారీగా కుదేలయ్యాయి. అమెరికా టెక్ మార్కెట్లలో చోటుచేసుకున్న భారీ పతనం దెబ్బకు, మన దేశీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్ వంటి షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో ఏకంగా భారీగా పతనమయ్యాయి.

మార్కెట్ గణాంకాలను గమనిస్తే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ శుక్రవారం ఒక్కరోజే 5% పైగా కుప్పకూలి 31,422.60 పాయింట్ల వద్దకు చేరింది. ఇది 2023 అక్టోబర్ తర్వాత నమోదైన అత్యంత కనిష్ట స్థాయి. కేవలం గత మూడు ట్రేడింగ్ సెషన్లలోనే ఈ ఇండెక్స్ ఏకంగా 12% విలువను కోల్పోవడం గమనార్హం. అంటే లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద కేవలం మూడు రోజుల్లోనే ఆవిరైపోయింది.

ఈ పతనానికి ప్రధాన కారణం అమెరికా మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలే. ఆ...