భారతదేశం, ఏప్రిల్ 28 -- ఏప్రిల్ 1 నుండి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైంది. పన్ను చెల్లింపుదారులు గత సంవత్సరానికి తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను(ఐటీఆర్) దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరం లేదా 2025-26 అసెస్‌మెంట్ సంవత్సరానికి సమర్పించాల్సిన ఫారమ్‌లను ఐటీ శాఖ త్వరలో తెలియజేస్తుంది. గడువు సమీపిస్తున్న కొద్దీ పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ దాఖలు చేయడానికి అన్ని రకాల పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. ఫారమ్-16 అనేది జీతం పొందే ఉద్యోగులకు అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటి. ఈ ఫారమ్ మీరు పనిచేసే కంపెనీ యాజమాన్యం ద్వారా జారీ అవుతుంది. ఈసారి ఫారమ్-16 ఫార్మాట్ మారుతుంది.

ఫారమ్ 16 ఉద్యోగి జీతం, దాని నుంచి డిడక్ట్ చేసిన టీడీఎస్ వివరాలను కలిగి ఉంటుంది. ఫారమ్ 16, దానిలోని విషయాలు ఉద్యోగికి, కంపెనీ నిర్వహణకు చాలా ముఖ్యమైనవి. దీనితో ఐటీఆర్ ఫైలి...