భారతదేశం, ఫిబ్రవరి 23 -- ప్రముఖ విద్యా సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్ సరికొత్త విద్యా కోర్సుతో ముందుకు వచ్చింది. మారుతున్న కాలానికి అనుగుణంగా మేనేజ్‌మెంట్ నైపుణ్యాలతో పాటు అనలిటికల్ సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో 'బీఎస్సీ ఇన్ మేనేజ్‌మెంట్ అండ్ డేటా సైన్స్' ప్రోగ్రామ్‌ను లాంచ్ చేసింది. నేటి డేటా యుగంలో వ్యాపార నిర్ణయాలు తీసుకోవడంలో డేటా సైన్స్ పాత్ర కీలకంగా మారిన నేపథ్యంలో ఈ కోర్సును డిజైన్ చేశారు.

ఈ ఐఐటీ మద్రాస్​ కొత్త కోర్సులో చేరడానికి వయోపరిమితి ఏమీ లేదు. అలాగే సీట్ల సంఖ్యపై కూడా ఎలాంటి పరిమితి విధించలేదు. ముఖ్యంగా 12వ తరగతి (ఇంటర్మీడియట్) ఉత్తీర్ణులైన వారు ఎవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం 11వ తరగతి ఫైనల్ పరీక్షలు రాసిన విద్యార్థులు కూడా ఇప్పుడే అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించారు. అయితే, వారు ఇం...