భారతదేశం, మే 10 -- దేశంలోని ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో సీట్లు పెరుగుతాయి. 23 ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ)లో 2025-26 సెషన్‌లో గత సంవత్సరంతో పోలిస్తే 1,364 సీట్లు అదనంగా అందుబాటులో ఉంటాయి. బి.టెక్, ఎం.టెక్, పీహెచ్.డి కోర్సుల్లో సీట్లు పెంచనున్నారు. సీట్లలో గరిష్ట పెరుగుదల బి.టెక్ కోర్సులలో ఉంటుంది.

బీటెక్‌లో సీట్ల సంఖ్యను జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జేఓఎస్ఏఏ) విడుదల చేయనుంది. ఐఐటీలో ఏ బ్రాంచిలో ఎన్ని సీట్లు పెంచుతారో జేఓఎస్ఏఏ చెబుతుంది. మే చివరి వారంలో సీట్ల జాబితాను ప్రచురించనుంది. ఈసారి బీటెక్‌లో అత్యధిక సీట్లు పెరగనున్నాయి. 2024లో 23 ఐఐటీల్లో 17740 బీటెక్ సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. 2025లో 23 ఐఐటీల్లో 18,500 సీట్లలో ప్రవేశానికి ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.

ఐఐటీలు జమ్మూ, భిలాయ్, తిరుపతి, ధార్వాడ్, పాలక్కాడ్లల...