భారతదేశం, జూలై 12 -- పశ్చిమ బెంగాల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్-కలకత్తా (ఐఐఎం-సీ)లో చదువుతున్న ఓ విద్యార్థిని తనపై తన తోటి విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపించింది. ఆమె సాయంత్రం హరిదేవ్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందితుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఐఐఎం-కలకత్తా కు చెందిన జోకా క్యాంపస్ లోని బాలుర హాస్టల్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. కౌన్సిలింగ్ కోసం రెండో సంవత్సరం విద్యార్థి తనను హాస్టల్ కు పిలిచాడని బాధితురాలు తన వాంగ్మూలంలో పేర్కొంది. అక్కడ ఆమెకు ఆఫర్ చేసిన పీజా, డ్రింక్ తీసుకున్న తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. స్పృహలోకి వచ్చాక తనపై లైంగిక దాడి జరిగిందని గ్రహించింది. ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలుంటాయని నిందితుడు తనను బెదిరించారని ఆమె తెలి...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.