Telangana,hyderabad, మే 23 -- తెలంగాణలో అకాల వర్షాలు దంచికొడుతున్నాయి. ఓవైపు ఎండల తీవ్రత తగ్గగా. మరోవైపు వాతవరణం క్రమంగా చల్లబడుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు కురవగా. మరో నాలుగు నుంచి ఐదు రోజుల పాటు రాష్ట్రంలోని పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. పలు జిల్లాలకు హెచ్చరికలను జారీ చేసింది.

రాబోయే 2 రోజుల్లో కేరళలోకి రుతుపవనాలు ప్రారంభానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణశాఖ తెలిపింది. దక్షిణ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలతో పాటు కేరళ, తమిళనాడు, ఉత్తర భారతంలోని మరికొన్ని ప్రాంతాలపైకి రుతుపవనాలు మరింత ముందుకు సాగే పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉంటుందని పేర్కొంది.

మరోవైపు మే 27వ తేదీ నాటికి పశ్చిమ మధ్య మరియు దానిని అనుకుని ఉన్న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వివరిం...