భారతదేశం, మే 30 -- ీరు రైలులో ప్రయాణించినప్పుడల్లా దాహం తీర్చుకోవడానికి రైల్ నీర్ వాటర్ బాటిల్ కొనుకున్న సందర్భాలు ఉండే ఉంటాయి. ఈ సేవలను ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అంటే ఐఆర్‌సీటీసీ మీకు అందిస్తుంది. దీని ద్వారా చాలా మందికి ఉపాధి లభిస్తుంది. వాటర్ బాటిళ్లు అమ్మడం ద్వారా ఐఆర్‌సీటీసీ ఎంత సంపాదిస్తుందో మీకు తెలుసా?

ఐఆర్‌సీటీసీ తన నాల్గో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. దీనిలో ఈసారి రూ.358 కోట్ల లాభం ఆర్జించిందని తెలిపింది. అయితే గత ఏడాది ఇదే కాలంలో ఈ లాభం రూ. 284 కోట్లుగా ఉంది. వివిధ కార్యకలాపాల ద్వారా ఐఆర్‌సీటీసీ లాభం 10 శాతం పెరిగి రూ.1269 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఇది రూ.1152 కోట్లుగా ఉంది.

2025 ఆర్థిక సంవత్సరం నాల్గో త్రైమాసికంలో రైల్ నీర్ నుండి ఐఆర్‌సీటీసీ రూ. 96 కోట్లు ఆర్జించింది. గత సం...