Hyderabad, జూన్ 5 -- అందాల రాక్షసి మూవీ తెలుసు కదా. 2012లో రిలీజై సంచలన విజయం సాధించింది. ఇప్పుడీ మూవీ జూన్ 13న రీరిలీజ్ కాబోతోంది. హను రాఘవపూడికి డైరెక్టర్ గా తొలి సినిమా. అంతేకాదు అందాల రాక్షసి, ఇప్పుడు మెగా ఇంటి కోడలు అయిన లావణ్య త్రిపాఠీకి అదే తొలి మూవీ. అందులో తన అమాయకపు చూపులు, అందంతో కట్టిపడేసింది. ఈ మూవీలోని ఏ మంత్రమో పాటలో ఆమె మరింత క్యూట్ గా కనిపిస్తుంది.

అందాల రాక్షసి సినిమాలోని అన్ని పాటలు ప్రేక్షకులను అప్పట్లో అలరించాయి. అయితే ఈ ఏ మంత్రమో సాంగ్ మాత్రం మరికాస్త ఎక్కువగానే ఆకట్టుకుంది. యూట్యూబ్ లో ఇప్పటికే 18 మిలియన్లకుపైగా వ్యూస్ సొంతం చేసుకుంది.

రాధన్ మ్యూజిక్ అందించిన ఈ పాటను వశిష్ట శర్మ రాశాడు. ఇక బోబో షాహి పాట పాడాడు. ఇప్పటికీ యువత మెచ్చే సాంగ్ ఇది. అందాల రాక్షసి మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వేళ.. ఏ మంత్రమో పాటను...