Hyderabad, ఆగస్టు 28 -- మంచు లక్ష్మి ప్రసన్న ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ దక్ష-ది డెడ్లీ కాన్‌స్పిరసీ (Daksha - The Deadly Conspiracy). శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్ అండ్ మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంశీ కృష్ణ మల్లా అందించారు.

'దక్ష - ది డెడ్లీ కాన్‌స్పిరసీ' సినిమాలో డాక్టర్ మంచు మోహన్ బాబు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. తండ్రీ కూతుళ్లు కలిసి మొదటి సారిగా ఇందులో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని, సెన్సార్ బోర్డ్ నుంచి యూఏ సర్టిఫికేట్‌ను సొంతం చేసుకుంది.

అంతేకాదు, మంచి మెసేజ్‌తో వస్తున్న ఇలాంటి సినిమాలు ఇప్పుడవసరం అంటూ సెన్సార్ సభ్యులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా మంచు లక్ష్మీ ప్రసన్న చేసిన టైటిల్ పాత్రను సెన్సార్ బ...