Telangana,andhrapradesh, ఆగస్టు 16 -- అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురువనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ వివరాలను పేర్కొంది. మరో మూడు నాలుగు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో హెచ్చరికలు జారీ అయ్యాయి.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ (ఆగస్ట్ 16) ప్రకారం.. ఇవాళ పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. నిర్మల్, నిజామాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చు. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, వికారాబాద్, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాల పడనున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. మరిక...