భారతదేశం, ఏప్రిల్ 25 -- మాజీమంత్రి విడదల రజనీకి ఉన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. రజనీపై నమోదు చేసిన కేసుకు సంబంధించి.. 41-ఏ నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. విచారణకు సహకరించాలని కూడా రజనీకి కోర్టు సూచించింది. రజనీ పీఏ రామకృష్ణకు 41-ఏ నోటీసులు ఇచ్చి విచారించాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. లక్ష్మీ బాలాజీ స్టోన్స్ క్రషర్స్ యజమానులను బెదిరించి అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని రజనీపై అభియోగాలు ఉన్నాయి.

విడదల రజనీపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. పల్నాడు జిల్లా ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్స్ యాజమాన్యం నుండి ఆమె, ఇతరులు రూ. 2.2 కోట్లు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో రజనీని ఏ1గా, అప్పటి ప్రాంతీయ విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి పల్లె జాషువాను ఏ2గా, రజనీ మరిది విడదల గోపిని ఏ3గా,...