Andhrapradesh, మే 25 -- ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో49 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటన్నింటిని కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేయనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ రెసిడెన్షియల్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నడిచే కోచింగ్ సెంటర్లలో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు.ఐఐటీ, నీట్ కోర్సులకు కోచింగ్ ఇవ్వడానికి అనుభవం ఉన్న ఫ్యాకల్టీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. 10 జిల్లాల పరిధిలో ఉన్న పలు కేంద్రాల్లో ఈ పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టుల భర్తీకి మే 26వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నారు. అర్హులైన అభ్యర్థులు https://swreis.ap.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫార్మట్, విద్యార్హతలు, అనుభవం, దరఖాస్తు ఫీజు, పూర్తి వివర...