Andhrapradesh, జూన్ 4 -- వైద్యారోగ్య శాఖలో సాధార‌ణ బ‌దిలీ ప్ర‌క్రియ‌లో ఐచ్ఛిక స్థానాల ప్రాధాన్య‌త‌లు తెలియ‌జేసే గ‌డువు నేటితో (బుధ‌వారం) ముగిసింది. త‌దుప‌రి కౌన్సిలింగ్ తో పాటు బ‌దిలీలు చేప‌ట్టాల్సిన ప్ర‌క్రియ‌పై మంత్రిత్వ శాఖ మరింత స్ప‌ష్ట‌త‌నిచ్చింది.

ఈ విష‌యంపై ప్ర‌భుత్వ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ్రీ ఎం.టి.కృష్ణ‌బాబు.. అన్ని విభాగాధిప‌తుల‌తో ఇవాళ 2 గంట‌ల పాటు చ‌ర్చించారు. పలు కీలక అంశాలపై రూపొందించిన కార్యాచ‌ర‌ణ‌ సూత్రాలను మంత్రి స‌త్య‌ కుమార్ యాద‌వ్ ఆమోదించారు.

1) ప్ర‌స్తుతం ఒకే చోట ప‌నిచేస్తున్న దంప‌తుల్లో ఒక‌రైనా అదే చోట ఐదేళ్ల‌లోపు ప‌నిచేసి ఉంటే వారిని అదే చోట కొన‌సాగించ‌వ‌చ్చు.

2) బ‌దిలీల నిర్ణ‌యాల్లో మొద‌ట ఐదేళ్ల ప‌ద‌వీకాలం పూర్తి చేసిన వారి బ‌దిలీ స్థానాల‌పై నిర్ణ‌యాన్ని తీసుకోవాలి.

3) 2 నుండి ఐదేళ్లలోపు ఒకే చోట ప‌నిచే...