Andhrapradesh, జూన్ 7 -- ఏపీ లాసెట్ - 2025 ప్రవేశ పరీక్ష ముగిసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. ఎంట్రెన్స్ ప్రవేశ పరీక్ష ప్రిలిమినరీ కీని విడుదల చేశారు. అంతేకాకుండా అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరించేందుకు గడువు కూడా పెట్టారు.

ఈనెల 5వ తేదీన ఏపీ లాసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ జరిగింది. మూడేళ్లు, ఐదేళ్ల కోర్సులతో పాటు ఎల్ఎల్ఎం కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఇందుకు 27 వేలకుపైగా అభ్యర్థులు హాజరయ్యారు. వీరంతా కూడా ప్రస్తుతం ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఏపీ లాసెట్ ప్రిలిమినరీ కీపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తారు. ఇందుకు జూన్ 8వ తేదీని గడువుగా నిర్ణయించారు. ఈలోపే నిర్ణీత నమూనాలో పంపాల్సి ఉంటుంది. లాసెట్ వెబ్ సైట్ లో కనిపించే కీ అబ్జెక్...