భారతదేశం, మే 1 -- ఏపీలోని మోడల్ స్కూళ్లలో ఆరో తరగతి ప్రవేశాలకు ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎగ్జామ్ కు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన విద్యార్థులు. వారి ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

రాష్ట్రంలో మొత్తం 164 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఆరో తరగతి, ఇంటర్ ప్రవేశాల కోసం ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఏప్రిల్‌ 21న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫలితాలను తాజాగా వెల్లడించారు.

మరోవైపు మోడల్ స్కూళ్లలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇప్పటికే ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ గడువు మే 22వ తేదీతో పూర్తవుతుంది. అర్హులైన విద్యార్థులు వెంటనే దర...