Andhrapradesh, ఆగస్టు 27 -- ఏపీ మెగా డీఎస్సీ అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను మరోసారి వాయిదా వేసింది. ఆగస్ట్ 28 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని విద్యాశాఖ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం 26 నుంచే ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ దీన్ని వాయిదా వేసినట్లు పాఠశాల విద్యాశాఖ తాజాగా వెల్లడించింది.

మరోవైపు కాల్ లెటర్లను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు వారి లాగిన్‌ ఐడీల ద్వారా కాల్‌ లెటర్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా వీటిని అభ్యర్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక కాల్‌ లెటర్లలోని సూచనలను కచ్చితంగా పాటించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.

ఆగస్ట్ 28 నుంచి ప్రారంభించే వెరిఫికేషన...