భారతదేశం, మే 31 -- ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. తాజాగా ఏపీ విద్యాశాఖ మెగా డీఎస్సీ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదల చేసింది. జూన్‌ 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు.

ఎన్నికల హామీ మేరకు కూటమి ప్రభుత్వం 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించింది. ఇటీవలె దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. డీఎస్సీకి మొత్తం 3,35,401 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఏపీ, తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో కూడా డీఎస్సీ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు విద్యాశాఖ తెలిపింది. ఈ రాష్ట్రాల నుంచి కూడా దరఖాస్తులు వచ్చాయి.

జూన్ 6 నుంచి జూన్ 30వ తేదీ వరకు మెగా డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. ప్రతిరోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొ...