భారతదేశం, మే 19 -- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీగా టీచర్ పోస్టులు భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహిస్తుంది. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మొత్తం 16,347 పోస్టులకు 5,67,067 దరఖాస్తులు వచ్చాయని విద్యాశాఖ తెలిపింది.

డీఎస్సీ-2025 మాక్ టెస్ట్ ను ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. మెగా డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు https://apdsc.apcfss.in/ వెబ్ సైట్ లో మాక్ టెస్ట్ రాయవచ్చు.

మాక్ టెస్ట్ అసలు పరీక్ష తరహా ఉంటుంది. అయితే, అసలు పరీక్ష లాంటి పరిస్థితుల్లో అభ్యర్థులను పరీక్షిస్తుంది. మాక్ టెస్ట్ ద్వారా అభ్యర్థులు పరీక్ష తీరుతెన్నులు, నిర్మాణం తెలుసుకుని పరీక్షలో అడిగే ప్రశ్నల రకాన్ని తెలుసుకుంటారు.

ఏపీ డీఎస్సీ హాల్ టికెట్లను మే 30న విడుదల చేస్తారు. జూన్ 6 నుంచి జులై 6 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. చివర...