Andhrapradesh, జూలై 8 -- ఏపీలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీఈసెట్‌-2025 కు సంబంధించి అధికారులు కీలక ప్రకటన చేశారు. జూలై 9వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు.

పీ పీజీఈసెట్‌-2025లో అర్హత సాధించిన అభ్యర్థులు.. జూలై 9వ తేదీ నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఈ గడువు జూలై 12వ తేదీతో పూర్తవుతుంది. జూలై 17వ తేదీ నుంచి వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయని అధికారులు ప్రకటించారు. నిర్ణయించిన రుసుంతో పాటు రిజిస్ట్రేషన్ల ప్రక్రియను https://cets.apsche.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా పూర్తి చేసుకోవాలని సూచించారు.

ఏపీ పీజీఈసెట్‌ - 2025లో భాగంగా.. 13 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా 14,231 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 11,244 మంది అర్హత సాధించారు. అభ్యర్థులు సాధ...