Andhrapradesh, మే 4 -- ఏపీ పాలిసెట్ - 2025 పరీక్ష ముగిసిన సంగతి తెలిసిందే. అయితే పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీని అధికారులు విడుదల చేశారు. ఏపీ పాలిసెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి ఈ కీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కీపై అభ్యర్థులకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే మే 5వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు పంపాలని అధికారులు తెలిపారు. preexam.apsbtet@gmail.com కు మెయిల్ చేయాలని సూచించారు.

ఏపీలోని పాలిటెక్నిక్‌ కళాశాలల్లోని వివిధ ఇంజినీరింగ్‌, నాన్‌-ఇంజినీరింగ్‌ డిప్లొమా కోర్సులలో ప్రవేశాలకు ఏప్రిల్ 30వ తేదీన పాలిసెట్‌ 2025 పరీక్షను నిర్వహించారు. మొత్తం 1,57,482 మంది దరఖాస్తు చేసుకోగా.. అందులో 1,39,749 మంది పరీక్ష రాశారు. ఇందుకు 89 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. మే 10వ తేదీ తర్వాత రిజల్ట్స్ అందుబాటులోకి రానున్నాయి. ఫలితాలతో పాటే ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవ...