Andhrapradesh, జూన్ 14 -- ఏపీ పాలీసెట్ 2025 అభ్యర్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఫలితాలు విడుడల కాగా. తాజాగా కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. జూన్ 20వ తేదీ నుంచి వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.

గత నెలలో ఏపీ పాలిసెట్-2025 ఫలితాలు విడుదలయ్యాయి. పాలిటెక్నిక్‌లలో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పాలిసెట్ 2025 ప్రవేశ పరీక్ష ఫలితాలు https://polycetap.nic.in/ వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 30, 2025న జరిగిన పాలిసెట్ పరీక్షకు 1,39,840 మంది అభ్యర్థులు హాజరు అయ్యారు. వీరిలో 1,33,358 మంది అభ్యర్థులు అంటే 95.36 శాతం ఉత్తీర్ణులయ్యారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....