భారతదేశం, జూన్ 25 -- ఏపీ డీఎస్సీ - 2025 పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు పరీక్షలు ముగియగా..మరికొన్ని జరగాల్సి ఉంది. అయితే జూన్ 20, 21వ తేదీల్లో జరగాల్సిన పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో. విద్యాశాఖ అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు.

జూలై 1, 2 తేదీల్లో జరగబోయే డీఎస్సీ పరీక్షల కొత్త హాల్ టికెట్లను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన హాల్ టికెట్లు ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానున్నాయి. https://apdsc.apcfss.in వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలని మెగా డీఎస్సీ కన్వీనర్ ఎం.వి కృష్ణారెడ్డి ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

అభ్యర్థులు తమ కొత్త హాల్ టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకొని.. ఒకటికి రెండు సార్లు పరీక్షా కేంద్రాలు సరిచూసుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలను ఖచ్చితంగా నిర్ధారించుకొని. పరీక్షకు హాజరు కావాలని కోరారు.

ఇక మంగళవా...