భారతదేశం, అక్టోబర్ 29 -- ఏపీలో డిగ్రీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం థర్డ్ ఫేజ్ కౌన్సెలింగ్ జరుగుతుండగా.... ముందుగా ప్రకటించిన షెడ్యూల్ లో పలు మార్పులు చేశారు. తుఫాన్ ఎఫెక్ట్ తో కౌన్సెలింగ్ తేదీల గడువును పొడిగించారు. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేసింది.

కొత్త షెడ్యూల్ ప్రకారం.... ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లకు ఈనెల 29 వరకు అవకాశం కల్పించారు. నవంబర్ 1వ తేదీ వరకు సర్టిఫికెట్లు అప్ లోడ్ చేసుకోవచ్చు. నవంబర్ 2వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఇక నవంబర్ 3వ తేదీన వెబ్ ఆప్షన్లను మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇక నవంబర్ 4వ తేదీన సీట్లను కేటాయిస్తారు. ఈ థర్డ్ ఫేజ్ లో సీట్లు పొందే విద్యార్థులు నవంబరు 7లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.

ఏపీ ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన షెడ్యూల్ ఆధారంగా. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడ...