Andhrapradesh, మే 3 -- రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం, ఇడుపులపాయ IIITల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. సెలెక్ట్ అయ్యే విద్యార్థులు ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్‌ కోర్సులో అడ్మిషన్లు పొందుతారు.

పదవ తరగతిలో మార్కుల ఆధారంగా 6 ఏళ్ల బీటెక్ కోర్సులో నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు. విద్యార్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు మే 20వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు జనరల్ అభ్యర్థులు రూ. 300, రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులు రూ. 200, ఇతర రాష్ట్రాల అభ్యర్థులు రూ. 1000 చెల్లించాల్సి ఉంటుంది. www.rgukt.in లేదా ఏపీ ఆన్ లైన్ కేంద్రాల ద్వారా ఫీజు చెల్లించటంతో పాటు అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు.

Published b...