Andhrapradesh,amaravati, మే 10 -- ఏపీలోని జిల్లా కోర్టుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అన్ని రకాల పోస్టులు కలిపి 1,620 ఉద్యోగాలున్నాయి. ఈ మేరకు ఏపీ హైకోర్టు.. వేర్వురు ప్రకటనలను జారీ చేసింది. ఇందులో డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 230 ఖాళీలు ఉన్నాయి.

జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ కోసం రాత పరీక్ష నిర్వహిస్తారు. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ఉంటుంది. మొత్తం 80 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ నాల్డెజ్ కి 40, జనరల్ ఇంగ్లీష్ 10, మెంటల్ ఎబిలీటికి 30 మార్కులు ఉంటాయి. సిలబస్ వివరాలను aphc.gov.in/recruitments వెబ్ సైట్ లో చూడొచ్చు. పరీక్ష సమయం 90 నిమిషాలు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. ప్రశ్నాపత్రం ఇంగ్లీష్ తో పాటు తెలుగు మీడియంలోనూ ఇస్తారు.

జూనియర్ అసిస్టెంట్ రాత పరీక్షలో ఈ...