Andhrapradesh, జూలై 11 -- ఏపీలోని జిల్లా కోర్టుల్లో ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లు విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పలు కోర్టుల్లోకలిపి మొత్తం 1,620 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. అయితే ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రాత పరీక్షలు తేదీలు వచ్చేశాయ్. ఈ మేరకు హైకోర్టు వెబ్ సైట్ లో వివరాలను పేర్కొన్నారు.

మొత్తం 1,620 ఖాళీలను రిక్రూట్ చేస్తుండగా.... వీటిల్లో అత్యధికంగా ఆఫీస్ సబార్డినేట్ (651) ఖాళీలు ఉండగా. ఆ తర్వాత జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 230 ఉన్నాయి. ఇవే కాకుండా ప్రాసెస్ సర్వర్, కాపీయిస్ట్, స్టెనో గ్రాఫర్, డ్రైవర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. ఆగస్టు 20వ తేదీ నుంచి ఎగ్జామ్స్ పారంభమై... ఆగస్టు 24వ తేదీతో ముగుస్తాయి. కంప్యూటర్ బేస్డ్ విధానంలో... సెషన్ల వారీగా ఈ పరీక్షలను నిర్...