Andhrapradesh, మే 9 -- ఏపీలోని జిల్లా కోర్టుల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. అన్ని రకాల పోస్టులు కలిపి మొత్తం 1,620 ఉన్నాయి. ఇందుకు వేర్వురు ప్రకటనలు విడుదల కాగా. ఇందులో పదో తరగతి అర్హతతోనే ప్రాసెస్ సర్వర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మే 13వ తేదీ నుంచి ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది.

ప్రాసెస్ సర్వర్ ఖాళీలను కేవలం పదో తరగతి అర్హతతోనే రిక్రూట్ చేయనున్నారు. అన్ని జిల్లా కోర్టుల్లో కలిపి మొత్తం 164 ఖాళీలు ఉన్నాయి. పదో తరగతిలో ఉత్తీర్ణత లేదా అందుకు సమానమైన పరీక్షలో పాసై ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వాళ్లకు స్థానిక భాష అయిన తెలుగు వచ్చి ఉండాలి. అనంతపురం జిల్లా అభ్యర్థులకు తెలుగుతో పాటు కన్నడ వచ్చి ఉండాలి. చిత్తూరు వాళ్లకు తమిళం వచ్చి ఉండాలి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభ్యర్థులకు తెలుగుతో పాటు ఒడిశా భాషా ...