భారతదేశం, మే 9 -- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లోని 5వ తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రవేశాలపై కీలక అప్డేట్ వచ్చేసింది. ఇటీవలనే పరీక్షను నిర్వహించగా. తాజాగా అధికారులు ఫలితాలను విడుదల చేశారు. అధికారిక వెబ్ సైట్ నుంచి ర్యాంక్ కార్డును డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

ఈ ఎంట్రెన్స్ టెస్ట్ ద్వారా ఏపీ గురుకులాల్లోని ఐదో తరగతిలో ప్రవేశాలు కల్పిస్తారు. అంతేకాకుండా 6, 7, 8 తరగతుల్లో మిగిలి ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేస్తారు. ఇక ఏపీఆర్ జేసీ ఎంట్రెన్స్ పరీక్ష ద్వారా. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ ఎగ్జామ్ ను ఏప్రిల్ 13వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. ఐదో తరగతిలో 15,020 సీట్లకు 32,823 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఇక ఇంటర్‌లో ఉన్న 13,680 సీట్లకు గాను. 32,733 మంది విద్యార్థులు పరీక్షకు హాజ...