Andhrapradesh, మే 3 -- ఏపీ ఐసెట్ - 2025 ప్రవేశ పరీక్షకు సంబంధించి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ఎంట్రెన్స్ ఎగ్జామ్ హాల్ టికెట్లను విడుదల చేశారు. ఏపీ ఐసెట్ అధికారిక వెబ్ సైట్ నుంచి వీటిని డౌన్లోడ్ చేసుకోవాలని ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

ఏపీ ఐసెట్ ప్రవేశ పరీక్ష ద్వారా. ఏపీలోని యూనివర్సిటీలు, అనుబంధ కాలేజీల్లో ఫుల్ టైమ్‌ ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఎగ్జామ్ ను మే 7వ తేదీన నిర్వహించనున్నారు. ఇప్పటికే అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఆలస్య రుసుంతో కూడా గడువు ముగిసిపోయింది. దీంతో శుక్రవారం అధికారులు హాల్ టికెట్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఈ ఏడాది ఏపీ ఐసెట్ - 2025 ప్రవేశ పరీక్షలను విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ నిర్వహిస్తోంది. మే7వ తేదీన ఎగ్జామ్ ఉండగా. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్ ఉంటుంది. ఇక...