Andhrapradesh, జూన్ 8 -- ఏపీ ఈఏపీసెట్ - 2025 ఫలితాలు వచ్చేశాయి. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వివరాలను వెల్లడించారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏపీ ఈఏపీసెట్ - 2025 పరీక్షలను నిర్వహించారు. పరీక్ష రాసిన విద్యార్థులు ఏపీఈఏపీసెట్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఈసారి అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ కు 81,837 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా. 75460 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 67,761 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 89.8 శాతం క్వాలిఫై అయ్యారు.

ఇక ఇంజినీరింగ్ స్టీమ్ లో చూస్తే. 2,80,611 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,64,840 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 1,89,748 మంది విద్యార్థులు అర్హత సాధించారు. మొత్తంగా 71.65 ఉత్తీర్ణత శాతం నమోదైంది.

ఏపీ ఈఏ...