Andhrapradesh, మే 4 -- వినోద రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోఅడుగు ముందడుగు వేసింది. రాష్ట్రంలో మొట్టమొదటి "ట్రాన్స్‌మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సిటీ"ని అభివృద్ధి చేయడానికి ప్రముఖ సంస్థ క్రియేటివ్‌ల్యాండ్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్‌తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. 2025 మే 1న ఈ చారిత్రాత్మక ఒప్పందంపై ఇరు పక్షాల ప్రతినిధులు సంతకాలు చేశారు.

ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థ, పర్యాటకం, నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ కల్పన మరియు డిజిటల్ ఆవిష్కరణలకు కేంద్రంగా మారనుంది. "క్రియేటర్ ల్యాండ్" పేరుతో రూపుదిద్దుకోనున్న ఈ నగరం సినిమా, గేమింగ్, ప్రకటనలు, వర్చువల్ ప్రొడక్షన్ మరియు టెక్నాలజీ ఆధారిత కథ చెప్పడం వంటి అత్యాధునిక సౌకర్యాలకు నిలయంగా ఉంటుంది.

ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు స్పందిస్తూ "క్రియేటర్ ల్యాండ్...