భారతదేశం, మే 4 -- "ఏపీలో 150-200 మైన్స్ ఉంటే, వాటిలో యాక్టీవ్ మైన్స్ 100 వరకూ ఉంటాయి. కానీ.. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక ఈ 10 నెలల్లో కేవలం 30 మైన్స్‌ను మాత్రమే సెలెక్టీవ్‌గా ఓపెన్ చేశారు. రాష్ట్రం నుంచి ఒక టన్ను మైన్స్ బయటికి వెళ్లినా.. ప్రభుత్వం తరఫున ఎక్కడో ఒక చోట పర్మిట్ కొట్టి తీరాల్సిందే.

వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో మైన్స్ ద్వారా రూ.150 కోట్ల వరకూ ప్రభుత్వానికి ఆదాయం సమకూరేది. కానీ ఇప్పుడు రూ.30-40 కోట్లు కూడా రావడం లేదు" అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు.

ఏపీలో అక్రమ మైనింగ్ జరుగుతోందని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శంచారు. వైసీపీ ప్రభుత్వంలో ఎన్నో గనులపై జరిమానాలు విధించారన్నారు. శోభారాణి మైన్ కు రూ. 32 కోట్లు విధించారని చెప్పారు. అధికారులు విచారణ చేసి ఆ గనిలో 35 వేల టన్నుల తెల్లరాయి ఉందని నివేదికలో తెలిపార...