Andhrapradesh, జూన్ 6 -- ప్రత్యేక ఆధార్ క్యాంపులపై ఏపీ ప్రభుత్వం మరోసారి ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ రెండో వారం, నాలుగో వారంలో స్కూల్స్, కాలేజీలు, సచివాలయాల్లో ఆధార్ ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు గ్రామ,వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ ఆదేశాలు ఇచ్చారు.

రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 5-15 ఏళ్ల వయసు గల 56,21,743 మందికి ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి చేశారు. దీంతో వీరంతా కూడా అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక క్యాంపులను ఏర్పాటు చేయనున్నారు. జూన్ 10-13వ తేదీ వరకు, జూన్ 24-27వ తేదీ వరకు ఈ క్యాంపులను నిర్వహించాలని ప్రభుత్వం తెలిపింది. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పౌరులకు సూచించింది.

చిన్నారుల‌కు ఆధార్ న‌మోదుకు క్యూర్ కోడ్ ఉన్న పుట్టిన తేదీ స‌ర్టిఫికేట్‌ ఉండాలి. అంతేకాకుండా ద‌ర‌ఖాస్తు ఫారం ఉండాల...