Andhrapradesh, మే 9 -- ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓవైపు కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడుతున్నప్పటికీ. మరికొన్నిచోట్ల మాత్రం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటోంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇవాళ(మే 9) ప్రకాశం జిల్లాలోని దరిమడుగులో42 డిగ్రీలు, తిరుపతి జిల్లాలోని గంగుడుపల్లెలో 41.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. రేపు (శనివారం) పలుచోట్ల 42 డిగ్రీల నుంచి 43.5 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.

శనివారం(మే 10) ఏపీలోని 3 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉంది. మరో 23 మండలాల్లో వడగాలులు ప్రభావంచూపే అవకాశం ఉంది. మరోవైపు అల్లూరి,చిత్తూరు,అన్నమయ్య,శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశ...