Andhrapradesh, ఆగస్టు 27 -- రాష్ట్రంలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. అయితే రిజిస్ట్రేషన్ల గడువును ఉన్నత విద్యామండలి పొడిగించింది. ఈ గడువు ఆగస్ట్ 26వ తేదీతో పూర్తి కాగా. ఈ సమయాన్ని సెప్టెంబర్ 1వ తేదీ వరకు పొడిగించారు. ఈలోపు అర్హులైన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని స్పష్టం చేశారు.

డిగ్రీ కోర్సుల్లో చేరుందుకు ఆసక్తి గల విద్యార్థులు https://oamdc.ucanapply.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ విద్యార్థులు రూ.400, బీసీలు రూ.300 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.200 ఫీజును కట్టాలి. ఆన్ లైన్ ద్వారానే ఈ ఫీజును చెల్లించాలి. వెబ్ ఆప్షన్ల గడువును కూడా సెప్టెంబర్ 2వ తేదీ వరకు పొడిగించారు.

ఏపీ ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన షెడ్యూల్ ఆధారంగా. రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్...