భారతదేశం, మే 25 -- ఏపీలో ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. బదిలీలపై ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా స్కూల్ అసిస్టెంట్ల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ గడువును పెంచింది. స్కూల్ అసిస్టెంట్ల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కు ఆదివారం రాత్రి 11.45 వరకు అవకాశం కల్పించింది. సాంకేతిక సమస్యల కారణంగా రిజిస్ట్రేషన్ కు మరో రోజు అవకాశం ఇచ్చారు.

ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలీలపై ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. స్కూల్ హెడ్ మాస్టర్లు ఒకే పాఠశాలలో ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసుకుంటే వారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

ఉపాధ్యాయులు ఒకే పాఠశాలలో 8 ఏళ్లు సర్వీస్ పూర్తయితే బదిలీకి అవకాశం ఉంటుందని విద్యాశాఖ పేర్కొంది. సర్వీస్‌ పాయింట్లను ఏడాదికి 0.5గా కేటాయించనున్నట్లు తెలిపింది.

కేటగిరి-1కు ఒక పాయింట్, కేటగిరి-2కు రెండు పాయింట్లు...