Andhrapradesh,amaravati, ఆగస్టు 14 -- ఏపీ ప్రభుత్వం కొత్త బార్ పాలసీని ప్రకటించింది. ఇటీవలనే మంత్రి వర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికలోని ప్రతిపాదనల ఆధారంగా ఈ పాలసీని తీసుకొచ్చారు. సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఈ కొత్త పాలసీ అమల్లోకి రానుంది. మూడేళ్ల కాలపరిమితితో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 840 బార్లు ఉన్నాయి. కొత్త పాలసీలో లాటరీ పద్దతి ద్వారా బార్లకు అనుమతులు ఇస్తారు. 50 వేల లోపు జనాభా ఉంటే రూ.35 లక్షలు, 5 లక్షల లోపు జనాభా ఉంటే రూ.55 లక్షలు, 5 లక్షల పైన జనాభా ఉంటే రూ.75 లక్షల చొప్పున లైసెన్స్ ఫీజు ఏడాదికి పెట్టాలనే సూచన మంత్రివర్గ ఉప సంఘం నుంచి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రతిపాదన ఆధారంగానే ఫీజులు వసూలు చేసే అవకాశం ఉంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....