భారతదేశం, మే 19 -- విజయనగరంలో ఉగ్రవాదులతో సంబంధం కలిగిన ఓ యువకుడిని నిఘా వర్గాలు అరెస్టు చేశాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్...సీఎస్, డీజీపీలకు లేఖ రాశారు.

ఆంధ్రప్రదేశ్ లో ఉగ్రవాద కదలికలపై నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తీర ప్రాంత జిల్లాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలన్నారు.

రోహింగ్యాలు, ఉగ్రవాద మద్దతుదారులు, సానుభూతిపరులు, స్లీపర్‌ సెల్స్‌పై దృష్టి పెట్టాలని కోరారు. రాష్ట్ర అంతర్గత భద్రతపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

ఆపరేషన్ సిందూర్ అనంతరం ఏపీలో ఉగ్రవాద కదలికలపై నిరంతర అప్రమత్తత అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. విజయనగరంలో ఒక యువకుడికి ఐసిస్ తో సంబంధాలున్నాయని, పేలుళ్లకు కుట్ర పన్నిన విషయాన్ని నిఘా వర్గాలు గ...