భారతదేశం, మే 4 -- రాష్ట్రంలోని పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. రాగల 2-3 గంటల్లో ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. గంటకు 60-85 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

అలాగే.. అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, కోనసీమ పరిసర జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ అయ్యింది. ఈ జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. హోర్డింగ్స్, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు దగ్గర నిలబడర...